కన్నా కదిలించేశారా ? జగన్ అందుకే?
నలభయ్యేళ్ళ చరిత్ర అని చెప్పుకుంటారు. ముమ్మారు ముఖ్యమంత్రి అంటారు. మూడు సార్లు ప్రతిపక్ష నేత అంటారు. లాక్ డౌన్ తరువాత గత నెల రోజులుగా చంద్రబాబు జగన్ [more]
నలభయ్యేళ్ళ చరిత్ర అని చెప్పుకుంటారు. ముమ్మారు ముఖ్యమంత్రి అంటారు. మూడు సార్లు ప్రతిపక్ష నేత అంటారు. లాక్ డౌన్ తరువాత గత నెల రోజులుగా చంద్రబాబు జగన్ [more]
నలభయ్యేళ్ళ చరిత్ర అని చెప్పుకుంటారు. ముమ్మారు ముఖ్యమంత్రి అంటారు. మూడు సార్లు ప్రతిపక్ష నేత అంటారు. లాక్ డౌన్ తరువాత గత నెల రోజులుగా చంద్రబాబు జగన్ మీద అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఉత్తరాలు రాస్తున్నారు. అయినా జగన్ లో ఎక్కడా చలనం లేదు. అటువంటిది ఒకే ఒక్క ట్వీట్ తో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ జగన్ ని కదిలించేశారు. రాపిడ్ కిట్ల కొనుగోల్ మాల్ లో కమిషన్ ఎంత కొట్టేశారేంటి? అంటూ చేసిన ట్వీట్ కి వైసీపీ సర్కార్ కూసాలు కదిలిపోయాయనే చెప్పాలేమో. లేకపోతే జగన్ కుడి భుజం విజయసాయిరెడ్డి సీన్ లోకి వచ్చేసి కన్నాతో చెడుగుడు ఆడేశారుగా. అంతేనా సగం వైసీపీ ప్రభుత్వం బయటకు వచ్చి కన్నా మీద దాడికి దండేత్తిందంటే కన్నా లక్ష్మీనారాయణ అక్కడికి విజయం సాధించారనే అనుకోవాలిగా.
ఇది బలమేనా…?
నిజానికి ఏపీలో బీజేపీకి అసలు బలం లేదు. శాసనమండలిలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా మండలి రద్దు ప్రతిపాదనతో ఉంటామా లేదా అన్నట్లుగా అయ్యారు. దాంతో బీజేపీకి ఏపీలో అంత సీన్ లేదని అనుకున్నారంతా. కానీ ఒక ఒక్క ట్వీట్ తో కన్నా లక్ష్మీనారాయణ 151 సీట్లతో ఉన్న బలమైన వైసీపీ సర్కార్ గుండెల్లో కన్నా గుబులు పుట్టించేశారు. నిజంగా ఈ ఆరోపణల్లో బలం కారణంగా ప్రభుత్వం సర్దుకోవాల్సివచ్చింది. దాంతో ఇపుడు కన్నా వైసీపీకి టార్గెట్ అయ్యారని అంటున్నారు.
ఫెయిల్ అయ్యారా…?
ఇదే సమయంలో 23 మంది ఎమ్మెల్యేలు, బలమైన పార్టీగా ఉన్న టీడీపీ మాత్రం ఇలాంటి విషయాల్లో పూర్తిగా ఫెయిల్ అయినట్లేనని అంటున్నారు. చంద్రబాబు వల్లనే ఇలా జరిగిందని కూడా తమ్ముళ్ళు ఇపుడు అంటున్నారు. ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం వరసగా మీడియా మీటింగులు పెడుతూ జగన్ ని బాబు పదే పదే తిడుతున్నారు. ఇక తమ్ముళ్ళూ అలాగే వ్యవహరిస్తున్నారు.దాంతో బాబు లాంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేస్తున్న ఆరోపణలల్లొ సీరియస్ నెస్ లేకుండా పోతోందని అంటున్నారు. నాయనా పులి వచ్చె కధ మాదిరిగా టీడీపీ నేతలు ఏం చెప్పినా జగనే కాదు, ప్రజలు కూడా పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఇక వైసీపీ సర్కార్ ఎటూ బాబుని పక్కన పెట్టేసింది.
కంగారేనా….?
బీజేపీకి ఎంత కాదనుకున్నా విశ్వసనీయత ఉంది. జనంలో ఆ పార్టీ రాజకీయ బలం కంటే నైతిక బలం మీద విశ్వాసం ఉంది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు చేసిన ట్వీట్ ఒక విధంగా వైసీపీ సర్కార్ లో అగ్గి పుట్టించింది. వెంటనే వైసీపీ పెద్దలు నష్ట నివారణ చర్యలకు దిగిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేసి మరీ వైసీపీ బాణాలు ఎక్కుపెడుతోంది. దాంతో టీడీపీ సైడ్ అయిపోయింది. మొత్తం మీద చూసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా అయి రెండేళ్ళు గడచిన తరువాత ఇన్నాళ్ళకు కమలం పార్టీకి కొత్త జోష్ తెచ్చారని అంటున్నారు. ఇదే ఊపు కొనసాగిస్తే ఏపీలో బీజేపీని పక్కన పెట్టడం వైసీపీ వల్ల కాదని అంటున్నారు. అదే సమయంలో టీడీపీని కూడా వెనక్కి తోసి బీజేపీ విపక్ష పాత్రలోకి ముందుకు వచ్చేందుకు కూడా వీలు ఉంటుందని అంటున్నారు.