Sun Jul 03 2022 08:58:00 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియా కరోనా అప్ డేట్

భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతన్నాయి. కొత్తగా ఈరోజు 11,271 కేసులు నమోదయ్యాయి. 285 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకూ భారత్ లో 3,38,37,859 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,35,918 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,63,530 మంది మరణించారు.
రికవరీ రేటు....
ఈరోజు 11,376 మంది బాధితులు కోలుకున్నారు. రికవరీ రేటు కూడా దేశ వ్యాప్తంగా పెరుగుతుంది. రికవరీ రేటు 98.36 శాతం ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తగా 1,12,01,03,225 మందికి వ్యాక్సిన్ ను అందచేయనున్నారు.
Next Story