సిగ్గుపడాలా? చీదరించుకోవాలా?
వెనకటికి ఒక సామెత ఉంది. తాచెడ్డ కోతి వనమల్లా చెరిచిందని. ఇపుడు ఏపీ రాజకీయాలకు అది అచ్చంగా సరిపోతుంది. కరోనా వైరస్ విషయంలో జగన్ ప్రభుత్వం మొదట్లో [more]
వెనకటికి ఒక సామెత ఉంది. తాచెడ్డ కోతి వనమల్లా చెరిచిందని. ఇపుడు ఏపీ రాజకీయాలకు అది అచ్చంగా సరిపోతుంది. కరోనా వైరస్ విషయంలో జగన్ ప్రభుత్వం మొదట్లో [more]
వెనకటికి ఒక సామెత ఉంది. తాచెడ్డ కోతి వనమల్లా చెరిచిందని. ఇపుడు ఏపీ రాజకీయాలకు అది అచ్చంగా సరిపోతుంది. కరోనా వైరస్ విషయంలో జగన్ ప్రభుత్వం మొదట్లో లైట్ గా తీసుకున్నా తరువాత అలెర్ట్ అయింది. ఆ తరువాత విపక్షాలు సైతం ఇది చాలా పెద్ద విపత్తు. ఇంకా చెప్పాలంటే ప్రాణాంతకమని భావింది ప్రభుత్వ చర్యలకు మద్దతుగా నిలిచాయి. వీలు అయితే సలహా సూచనలు ఇస్తూ వచ్చాయి. ఈ నేపధ్యం ఇలాగే సాగితే టీడీపీ గురించి ఇక్కడ ఎందుకు చెప్పుకోవాలి. సరిగ్గా ఇదే టైంలో చంద్రబాబు హైదరాబాద్ లో ఒక రోజు జనతా కర్ఫ్యూ పాటించారు. తన మనవడు దేవాన్ష్ కి పాఠాలు చెప్పారు. చంద్రబాబు తాత గారి హోదాలో ఇక కొంతకాలమైనా విశ్రాంతిగా ఉంటారని, లాక్ డౌన్ పీరియడ్ లో ఆయనకు ఇది చాలా మేలు చేసే వ్యవహారమని అంతా అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నది చంద్రబాబు కదా. అంతే ఆయన ఒక్క రోజు కూడా ఇంట్లో కుదురుగా ఉండలేకపోయారు కాబోలు. సాయంత్రం అయితే చాలు మీడియా ముందుకు వచ్చేసి కరోనా వైరస్ మీద ఒకవైపు జనాలను భయపెడుతూ మరో వైపు జగన్ సర్కార్ మీద హాట్ కామెంట్స్ యధాప్రకారం చేస్తూ పోయారు.
బురదజల్లుడే…..
ఏపీలో కరోనా వైరస్ బాధితులు కనీసం అరడజను కూడా లేని టైంలోనే చంద్రబాబు పెద్ద గొంతు చేశారు. జగన్ సర్కార్ అసలు ఏమీ పనిచేయడంలేదని విమర్శలు లంకించుకున్నారు. జగన్ కి సీరియస్ నెస్ లేదని కూడా గట్టిగానే విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగానే మరో వైపు కరోనా కేసులు పది దాటి పదిహేనుగా పెరిగాయి. చంద్రబాబు స్వరం కూడా ప్రతీ రోజూ పెరుగుతూ వచ్చింది. ఇలాగైతే చాలామంది చనిపోతారంటూ చంద్రబాబు జనాలను కూడా బెదరగొట్టడమూ మొదలుపెట్టారు. ఇంకోవైపు ఏపీలో పారదర్శకత లేదని, బాధితుల వివరాలు ఏవీ ప్రభుత్వం చెప్పడంలేదని కూడా ఆయన తగులుకున్నారు. ఇక ఢిల్లీ ప్రార్ధనా ఘటనలతో ఏపీలో వెల్లువలా కరొనా కేసులు పెరిగాయి. ఇంకేం చంద్రబాబు కూడా మరింతగా గొంతు పెంచి పూర్తి స్థాయి పొలిటీషియన్ అవతారం ఎత్తేశారు.
తగ్గితే బాగోదని..?
చంద్రబాబు ఒక్కరే ఇలా విపక్ష రాజకీయ మైదానంలో నిలబడి సర్కార్ని నిలదీస్తే ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే పోతుందని భయపడ్డాయో ఏమో గానీ మిగిలిన పార్టీలు కూడా గొంతు కలిపేశాయి. మొదట్లో జగన్ సర్కార్ చర్యలు భేష్ అన్న బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ జగన్ మీద యధా ప్రకారం విమర్శలకు పదును పెట్టేస్తున్నారు. ఇక ప్రభుత్వాలకు విరాళాలు ఇస్తూ కరోనాపైన తన ట్విట్టర్ ద్వారా అవగాహన జనాలకు పెంచుతూ కొంత చురుకుగా ఉంటూ వస్తున్న జనసేనాని పవన్ సైతం ఈ మొత్తం ఎపిసోడ్ లో తమ పాత్ర తక్కువ అయిపోతుందేమనని ఆందోళనతో జత చేరాడు. అంతే సీపీఐ రామకృష్ణ, కాంగ్రెస్ ఇలా మెల్లగా అంతా కలసి పోయి రొటీన్ పాలిటిక్స్ కి తెరతీశారు. కరోనా వైరస్ వంటి ప్రాణాంతకి కూడా హడలిపోయేలా ఏపీలో రొచ్చు రాజకీయాలకు విపక్షం తెర తీయడం హేయమని అనుకుంటే దానికి ఆద్యుడు చంద్రబాబు అనే చెప్పాలంటున్నారు.
జాతీయ విపత్తు….
నిజానికి కరోనా వైరస్ అన్నది జాతీయ, అంతర్జాతీయ విపత్తు. అంతే కాదు, ఎవరూ వూహించని, ఎవరికీ కొరుకుడు పడని మహమ్మారి. అటువంటి వైరస్ మీద పోరాటం చేయాలంటే అంతా ఐక్యంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏపీలో చూస్తే కడుపు మంట రాజకీయమే పై చేయి సాధించడం దురదృష్టకరమే. హుదూద్ తుఫాన్ లాంటివి వచ్చాయంటే అవి ఒక ప్రాంతానికే పరిమితం. కానీ కరోనా అలా కాదు. అది ప్రపంచవ్యాప్తంగా ఉంది. దానికి జగన్ ఒక్కడిని బాధ్యులుగా ఎలా చేస్తారు. ఆ మాత్రం ఇంగితం విపక్షాలకు లేకపోవడం వల్లనే ఏపీలో చిల్లర రాజకీయం నడుస్తోందని అంటున్నారు. ఇక చంద్రబాబు ఈ రోజు నీతులు చెబుతున్నారు కానీ శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ వచ్చినపుడు తాను స్వయంగా బాధితులకు నిత్యవసరాలు పంచడమే కాదు, తన పార్టీ వారి చేత, ఏ హోదా, అధికారం అసలు లేని జన్మభూమి కమిటీ సభ్యుల చేత కూడా పంపిణీ చేయించారు. ఇపుడు అదే చంద్రబాబు వైసీపీ నేతలు పేదలకు వేయి రూపాయలు పంపిణీ చేస్తే తప్పు పడుతున్నారు. ఇలాంటి జాఢ్యాలకు టీడీపీ నాడే బీజం వేసింది. ఏది ఏమైనా రాజకీయం తప్ప మాకేదీ రాదు, కుదరదని ఏపీలో విపక్షం చెప్పడం, అదీ ఆపత్కాలంలో ఇలా దూషణ భూషణలకు దిగడాన్ని మిగతా ప్రపంచం గమనిస్తోంది, సిగ్గుపడుతోంది.