ఇలాగయితే కష్టమే..? ఎప్పటికీ నీడగానేనా ?
రాజకీయాల్లో ఎవరైనా ఒకరి ఆశ్రయం తీసుకునే బయటకు వస్తారు. రాజకీయ గురువు కొంతవరకే దారి చూపుతాడు, ఆ తరువాత తమంతట తాముగా ఎదగాలి. చీకటిని చీల్చుకుంటూ వెలుగు [more]
రాజకీయాల్లో ఎవరైనా ఒకరి ఆశ్రయం తీసుకునే బయటకు వస్తారు. రాజకీయ గురువు కొంతవరకే దారి చూపుతాడు, ఆ తరువాత తమంతట తాముగా ఎదగాలి. చీకటిని చీల్చుకుంటూ వెలుగు [more]
రాజకీయాల్లో ఎవరైనా ఒకరి ఆశ్రయం తీసుకునే బయటకు వస్తారు. రాజకీయ గురువు కొంతవరకే దారి చూపుతాడు, ఆ తరువాత తమంతట తాముగా ఎదగాలి. చీకటిని చీల్చుకుంటూ వెలుగు రేఖలు ప్రసరించాలి. మరి విజయనగరం ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ తీరు అందుకు భిన్నంగా ఉందని అంటున్నారు. ఎంపీ ఇప్పటికీ మంత్రి బొత్స సత్యానారాయణ నీడగానే ఉంటున్నారని, స్వయం ప్రకాశంతో వికసించలేకపోతున్నారని అంటున్నారు. ఆయన బొత్సకు దగ్గర బంధువు కూడా అవుతారు. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా టికెట్ రావడం, ఏకంగా విజయనగరం రాజు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ నే ఓడించి ఢిల్లీలో అడుగుపెట్టేశారు.
అలా శ్రీకారం….
బెల్లాల చంద్రశేఖర్ ను బొత్స సత్యనారాయణ ఓ ఆపత్కాలంలో రాజకీయంగా ముందుకు తీసుకురావాల్సివచ్చింది. తన సతీమణి బొత్స ఝాన్సీ విజయనగరం జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నపుడు బొబ్బిలి టీడీపీ ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడు మరణించడంతో ఉప ఎన్నిక వచ్చిపడింది. దాంతో బొత్స తన సతీమణిని బరిలోకి దించి గెలిపించుకున్నారు. అపుడు జెడ్పీ చైర్మన్ గా బెల్లాల చంద్రశేఖర్ వ్యవహరించారు. ఆ తరువాత ఆయన కూడా రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు.
గురువు తోనే…..
ఇక బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ లో ఉంటే 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన బెల్లాల చంద్రశేఖర్ కు చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా వైసీపీ టికెట్ ఇచ్చింది. దాంతో గురువు బొత్స కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే ఆయన మీదనే వైసీపీ తరఫున పోటీ చేసి బెల్లాల చంద్రశేఖర్ ఓడిపోయారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన పోరులో మూడవ పార్టీగా టీడీపీ నుంచి కళా వెంకటరావు మరదలు కిమిడి మ్రుణాళిని స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఆ తరువాత బొత్స సైతం వైసీపీలోకి రావడం, చీపురుపల్లి నుంచి 2019 ఎన్నికల్లో మళ్ళీ పోటీకి దిగడంతో వైసీపీ హై కమాండ్ బెల్లాల చంద్రశేఖర్ కి అన్యాయం చేయకూడదన్న ఉద్దేశ్యంతో ఎంపీ టికెట్ ఇచ్చింది. అనూహ్యంగా ఆయన గెలిచి రాజుల మీదనే సత్తా చూపారు.
ఏడాదవుతున్నా …..
ఇక ఎంపీగా బెల్లాల చంద్రశేఖర్ తన పనితీరు మెరుగుపరచు కోలేదన్న విమర్శలు ఉన్నాయి. గెలిచింది అశోక్ మీద. కనీసం ఆయనలో సగమైనా పెర్ఫార్మెన్స్ చూపిస్తేనే జనం మళ్ళీ ఆదరిస్తారు. పట్టం కడతారు. కానీ బెల్లాల చంద్రశేఖర్ ఇంకా తాను బొత్స అనుచరుడిగానే వ్యవహరిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఎంపీ సీటు నుంచి గెలిచిన నేతగా తన సమర్ధతను చూపాల్సిన తరుణంలో ఆయన ఏమీ కాకుండా మిగులుతున్నారని అంటున్నారు. జిల్లాలో పొలిటికల్ గా బొత్స దూకుడు ఎటూ ఉంటుంది. కనీసం జిల్లా సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించి వెనకబడిన ప్రాంతానికి న్యాయం చేయడం. పార్టీలో నమ్ముకున్న క్యాడర్ కి అండగా ఉండడం, పార్టీ పటిష్టతకు కృషిచేయడం వంటి విషయాలలో బెల్లాల చంద్రశేఖర్ చాలా వెనకబడే ఉన్నారని అంటున్నారు. ఆయన బొత్స నీడ అన్న పేరును సుస్థిరం చేసుకుంటున్నారని అంటున్నారు. ఇదే కనుక కొనసాగితే మళ్ళీ అశోక్ రాజకీయంగా పుంజుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.