Sun Dec 14 2025 17:32:39 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : స్పీకర్ వేటు వేసేశారు
కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. నాలుగేళ్ల వరకూ వారు పోటీ [more]
కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. నాలుగేళ్ల వరకూ వారు పోటీ [more]

కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. నాలుగేళ్ల వరకూ వారు పోటీ చేయకుండా ఈ వేటు విధించారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనర్హత వేటు పడిన వారిలో 14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సోమవారం ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష కు దిగబోతుండగా స్పీకర్ అనూహ్య నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.అయితే ప్రస్తుతమున్న సంఖ్యాబలం ప్రకారం యడ్యూరప్ప గట్టెక్కే అవకాశాలున్నాయి.
Next Story

