పాపం.. జూనియర్ ద్రోణం… ?
ద్రోణం రాజు సత్యనారాయణ రాజకీయ కుటుంబంలో మూడవ తరం మరీ ఇంత పేలవంగా బేలతనంగా ఉంటుందని ఎవరూ అసలు ఊహించలేదు. అదే ద్రోణంరాజు ప్రాపకంతో ఆయన సొంత [more]
ద్రోణం రాజు సత్యనారాయణ రాజకీయ కుటుంబంలో మూడవ తరం మరీ ఇంత పేలవంగా బేలతనంగా ఉంటుందని ఎవరూ అసలు ఊహించలేదు. అదే ద్రోణంరాజు ప్రాపకంతో ఆయన సొంత [more]
ద్రోణం రాజు సత్యనారాయణ రాజకీయ కుటుంబంలో మూడవ తరం మరీ ఇంత పేలవంగా బేలతనంగా ఉంటుందని ఎవరూ అసలు ఊహించలేదు. అదే ద్రోణంరాజు ప్రాపకంతో ఆయన సొంత ప్రాంతానికే చెందిన మాజీ ఎమ్మెల్యే గుడివాడ అప్పన్న మూడవ తరం కూడా బ్రహ్మాండంగా రాజకీయాల్లో రాణిస్తోంది. ఆయన మనవడే ప్రస్తుత అనకాపల్లి యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్. అమరనాధ్ తండ్రి గుడివాడ గురునాధరావు కూడా మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. మరి సీనియర్ ద్రోణంరాజు చూస్తే ఉత్తరాంధ్రా రాజకీయాల్లో శిఖరాయమానంగా వెలుగొందారు. ఆయన అండతోనే ఎంతో మంది శిష్యులు ఎదిగారు.
అక్కడ చోటు లేదుగా …?
తాజాగా జగన్ తన చేతికి ఎముక లేనట్లుగా నామినేటెడ్ పదవులను అన్నీ కూడా తీరి కూర్చుని పంచేశారు. ఇందులో చూస్తే విశాఖ జిల్లాకు పెద్ద పీట వేశారు. చాలా మందికి పదవులు ఇచ్చిన జగన్ ద్రోణం రాజు కుటుంబాన్ని విస్మరించారని అంటున్నారు. ఇది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అన్నది పక్కన పెడితే పెద్దాయన ద్రోణం రాజు మనవడు శ్రీవాత్సవ్ కి చిన్నపాటి పదవి కూడా దక్కలేదు. దాంతో ఆ కుటుంబాన్ని అభిమానించేవారు అంతా కూడా బాధపడుతున్నారు. ఉన్నత చదువులు చదివి చక్కగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటున్న ద్రోణంరాజు శ్రీవాత్సవ్ రాజకీయాల్లోకి అనవసరంగా అడుగుపెట్టారా అన్న మాట కూడా ఉందిపుడు.
కండువాలు కప్పడమే ?
ఇక ద్రోణంరాజు శ్రీవాత్సవ్ పని ఏంటి అంటే పదవులు వచ్చిన వారి ఇళ్ళకు వెళ్ళి కండువాలు కప్పి అభిమందించడమే అంటున్నారు. ఈ యువ నాయకుడు అలా చేస్తూనే తన గురించి కూడా చెప్పుకుంటున్నాడు కానీ వారు ఏమి చేయగలరు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇక విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డితోనూ సన్నిహితంగా కూడా జగన్ చెవిన ఆయన ద్రోణంరాజు శ్రీవాత్సవ్ విషయం వేయలేదా అని అభిమానులు మధనపడుతున్నారు. చనిపోయే ముందు కూడా ద్రోణం రాజు శ్రీనివాస్ తన కుమారుడి భవిష్యత్తుని చూసుకోవాలని విజయసాయిరెడ్డికి చెప్పారు. మరి జూనియర్ ద్రోణంకి ఇవ్వడానికి పదవి అంటూ లేదా అని అంతా అంటున్నారు.
సౌత్ లో ఒక్కడే …?
విశాఖ సౌత్ నియోజకవర్గంలో ద్రోణం రాజు కుటుంబానికి మంచి పలుకుబడి ఉంది. ఇక్కడ ఉన్న కీలకమైన నాయకులు అందరికీ జగన్ పదవులు సర్దేశారు. టీడీపీ నుంచి వచ్చిన వాసుపల్లి వైసీపీ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. ఇక పార్టీలో చాలాకాలంగా ఉంటున్న కోలా గురువులుకు ఫిషరీస్ కార్పోరేషన్ పదవి దక్కింది. మైనారిటీ నాయకుడు జాన్ వెస్లీకి కూడా రాష్ట్ర స్థాయి హోదా దక్కింది. మరి కీలకవర్గంగా ఉంటూ ద్రోణం రాజు ఫ్యామిలీని నమ్ముకున్న వారికి ద్రోణంరాజు శ్రీవాత్సవ్ అండగా ఉంటున్నారు. ఆయనకు కూడా పదవి ఇస్తే సౌత్ లో సమ న్యాయం చేసినట్లుగా ఉంటుందని అంటున్నారు. మరి జగన్ చేతిలో ఈ జూనియర్ పొలిటికల్ ఫ్యూచర్ ఉంది. ఆయన ఏం చేస్తారో చూడాల్సిందే.