Fri Jan 30 2026 14:35:26 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. యువతి గొంతుకోసి చంపేశాడు
ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. మృతురాలు ఒక కానిస్టేబుల్ కూతురిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు..

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కొండమిట్టలో ప్రశాంతి అనే యువతి గొంతుకోసి చంపేశాడో ఉన్మాది. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. కొనఊపిరితో ఉన్న ఆ యువకుడిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడిని చక్రవర్తిగా గుర్తించారు.
ప్రశాంతి ఆరు నెలలుగా కొండమిట్ట ప్రాంతంలో బ్యూటీపార్లర్ నడుపుతోంది. ఆ పార్లర్ కు వచ్చిన చక్రవర్తి ఆమెపై హఠాత్తుగా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. మృతురాలు ఒక కానిస్టేబుల్ కూతురిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ప్రశాంతి మృతదేహాన్ని పోస్టుమార్టం కు పంపారు. చక్రవర్తిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో.. పోలీసులు విచారణ చేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

