Wed Jan 21 2026 03:30:37 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంద.ి ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంద.ి ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన కుటుంబంలో విషాదం నింపింది. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం ఓడ్యాట్పల్లిలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మరణించారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల రోదన అంతా ఇంతా కాదు.
ముగ్గురూ...
మృతులను తిరుపతి, నవీన్, మహేష్ గా గుర్తించారు. ఈత రాకుండా చెరువులోకి దిగడం.. నీళ్లు ఎక్కువగా ఉండటంతోనే చిన్నారులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story

