Sun Feb 01 2026 18:55:19 GMT+0000 (Coordinated Universal Time)
అపార్ట్ మెంట్ లోకి వచ్చి మహిళ మెడలో..?
కూకట్ పల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో దొంగలు రెచ్చిపోయారు

Heading
Content Area
Heading
Content Area
కూకట్ పల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఒక అపార్ట్ మెంట్ లోకి వచ్చి మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డుకాలనీ రోడ్డు నెంబరు 2లో పద్మజ రెడ్డి అనే మహిళ మెడలో నుంచి దొంగ బంగారు గొలుసును లాక్కెళ్లాడు.
సీసీ కెమెరాల్లో...
దొంగ నేరుగా అపార్ట్ మెంట్ లోకి వచ్చి మహిళ ఇంటిలోకి చొరబడి మరీ గొలుసును లాక్కెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

