Thu Jan 29 2026 05:53:46 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో కాల్పులు
తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు జరిగాయి.

తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కొందరికి గాయాలయినట్లు సమాచారం. దీంతో తెలంగాణ - ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో కాల్పులు కలకలం రేగింది. చింతవాగు, ధర్మారం, పామెడు క్యాంపులపై మావోయిస్టులు కాల్పుల ప్రారంభించారు.
తెల్లవారు జాము వరకూ...
దీంతో భద్రతాదళాలు ఎదురు కాల్పులకు దిగాయి. తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దు బీజాపూర్ జిల్లా పామేడు పరిధిలో కాల్పులు జరిగాయి. రాత్రి మూడు క్యాంపులపై ఒకే సారి కాల్పులకు మావోయిస్టులు జరపడంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. తెల్లవారు జాము వరకు జరిగిన కాల్పులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. అయితే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story

