Sat Jul 27 2024 01:14:48 GMT+0000 (Coordinated Universal Time)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురి మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు
![road accident, pandaripur, pune high way, maharashtra road accident, pandaripur, pune high way, maharashtra](https://www.telugupost.com/h-upload/2022/03/14/1336882-road-accident-pandaripur-pune-high-way-maharashtra.webp)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతంలోని డిండిలో ఈ ఘటన జరిగింది. పండరీపూర్ కు దైవదర్శనం కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తుల్జాపూర్ లోని కడంవాడి వాసులు పండరీపూర్ కు దైవదర్శనానికి ఒక ట్రాక్టర్ లో బయలుదేరారు. ట్రాక్టర్ లో దాదాపు నలభై మందికి పైగానే ఉన్నారు.
దైవ దర్శనానికి....
అయితే షోలాపూర్ - పూనే హైవై పైన భక్తులతో వెళుతున్న ట్రాక్టర్ ను ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా ముప్ఫయి మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను షోలాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story