Thu Mar 19 2026 22:10:33 GMT+0530 (India Standard Time)
బ్రేకులు ఫెయిలయిన బస్సు : ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. బస్సులు బ్రేకులు ఫెయిలయి నిద్రపోతున్న యాత్రికులపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. అనేక మంది గాయాలపాలయ్యారు. ఉత్తరాఖండ్ లోని చంపావత్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
చైత్రనవరాత్రి వేడుకలకు...
చైత్ర నవరాత్రి వేడుకలు ప్రారంభమయిన సందర్భంగా పూర్ణగిరి మేళాకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. అయితే పూర్ణగిరిలోని ఒక బస్టాండ్ వద్ద రాత్రికి నిద్రపోయారు. కాని బ్రేకులు ఫెయిలయి ఒక బస్సు నిద్రపోతున్న వారిపైకి దూసుకొచ్చింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story

