Fri Dec 05 2025 12:24:08 GMT+0000 (Coordinated Universal Time)
గుడివాడలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురి మృతి
గుడివాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు.

గుడివాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. బైక్ పై వెళుతున్న ముగ్గురిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సాయంత్రం వేళ గుడివాడ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు
యువకులు వీరు...
గుడివాడ బస్టాండ్ సెంటర్ లో బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బస్సు కింద పడి ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు యువకులు సోహెల్, సాయి, హర్షగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
Next Story

