Fri Dec 05 2025 16:54:09 GMT+0000 (Coordinated Universal Time)
కేరళలో ఘోర ప్రమాదం: 22 మంది మృతి
కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తాపడి 22 మంది మరణించారు.

కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తాపడి 22 మంది మరణించారు. కేరళలోని మలప్పురంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తానూరులోని కెట్టుంగల్ బీచ్ వద్ద టూరిస్ట్లతో వెళుతున్న బోటు బోల్తా పడటంతో 22 మంది మరణింాచరు. నిన్న రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.
సామర్థ్యానికి మించి...
మునిగిపోయిన పర్యాటకుల మృతదేహాలను వెలికి తీసే ప్రక్రియను వెంటనే ప్రారంభించారు. ఎక్కువ మంది పర్యాటకులను బోటులో ఎక్కించారని, సామర్థ్యానికి మించి టూరిస్ట్లను ఎక్కించడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రధాని మోదీ ఈ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించారు.
Next Story

