Fri May 17 2024 02:22:02 GMT+0000 (Coordinated Universal Time)
ఫోన్ మాట్లాడుతుండగా యువతికి షాక్
తమిళనాడు దుర్ఘటన చోటు చేసుకుంది. ఫోన్ మాట్లాడుతుండగా యువతికి విద్యుత్తు షాక్ తగిలింది
తమిళనాడు దుర్ఘటన చోటు చేసుకుంది. ఫోన్ మాట్లాడుతుండగా యువతికి విద్యుత్తు షాక్ తగిలింది. హాస్టల్ గదిలో కిటికీలు తెరిచి ఫోన్ మాట్లాడుతుండగా విద్యుత్ షాక్ తగిలింది. కిటికీ బయట అతి సమీపంలో ఉన్న విద్యుత్తు పోల్, ఫోన్ కు అటాచ్ చేసి ఉన్న పవర్ బ్యాంకు నుంచి సడెన్ గా విద్యుత్తు షాక్ తగిలింది.
మరో ఇద్దరికి...
షాక్ తో అల్లాడిపోయిన యువతిని కాపాడేందుకు గదిలో ఉన్న మరో ఇద్దరు కాపాడే ప్రయత్నం చేయబోయారు. వారికి కూడా షాక్ తగిలింది. ప్రస్తుతం ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఫోన్ మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణఉలు సూచిస్తున్నారు.
Next Story