Tue Jan 20 2026 23:49:31 GMT+0000 (Coordinated Universal Time)
వీకెండ్ వస్తే ఫుల్లుగా తాగటమేనట
మద్యం తాగి ఇద్దరు మృతికి కారణమైన రోహిత్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు

నిన్న మద్యం తాగి ఇద్దరు మృతికి కారణమైన రోహిత్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. పథ్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. రోహిత్ నిన్న మద్యం తాగి ర్యాష్ గా డ్రైవింగ్ చేసి ఇద్దరిని బలి తీసుకున్నారు. బీహార్ నుంచి వచ్చి ఒక ఆసుపత్రి క్యాంటిన్ లో పనిచేస్తున్న ఇద్దరు యువకులు రోహిత్ కారు ఢీకొని మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి రోహిత్ తో పాటు అతని స్నేహితుడిని అరెస్ట్ చేశారు.
రియల్ ఎస్టేట్ బిజినెస్ కావడంతో....
కాగా రోహిత్ శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. అక్కడ కూడా కొందరు యువతులను ప్రేమించి మోసం చేశాడన్న ఆరోపణలున్నాయి. రోహిత్ తండ్రి పాండు ఉప్పల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తండ్రి సంపాదనతో రోహిత్ ప్రతి వీకెండ్ పబ్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటాడని, స్నేహితులతో కలసి మద్యం తాగి చిందులు తొక్కుతుంటాడని స్థానికులు చెబుతున్నారు.
Next Story

