Tue Jan 20 2026 06:16:06 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఒంగోలు సమీపంలో ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
సంక్రాంతి వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రయివేటు ట్రావెల్స్ కు ప్రమాదం జరిగింది

సంక్రాంతి వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రయివేటు ట్రావెల్స్ కు ప్రమాదం జరిగింది. సింగరాయకొండలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి లారీని కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో...
ప్రమాద సమయంలో బస్సులో 20 మంది వరకూ ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తు, అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బస్సును అక్కడి నుంచి తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

