Thu Mar 27 2025 04:02:07 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 29 మందికి గాయాలయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు సమీపంలోని కేజీ కందిగై రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన బస్సు, లారీ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
అతి వేగమే కారణమని...
గాయపడిన వారికి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు, లారీ ఢీకొట్టుకోవడంతో ఆ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయింది. దీంతో పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ట్రాఫిక్ ను పునరుద్ధరించేందుకు క్రేన్లతో వాటిని తొలగిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Next Story