Sat Jul 27 2024 01:15:54 GMT+0000 (Coordinated Universal Time)
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు.
![road accident, hanmakonda district, three people were killed road accident, hanmakonda district, three people were killed](https://www.telugupost.com/h-upload/2022/02/20/1327186-road-accident-hanmakonda-district-three-people-were-killed.webp)
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థిితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
అంతా కూలీలే...
హన్మకొండ జిల్లాలో మిర్చి పంట కోసం వెళుతున్న కూలీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢొకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story