Sat Jul 27 2024 01:35:41 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం
కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. శుక్రవారం రాత్రి
![ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం](https://www.telugupost.com/h-upload/2022/01/08/1308452-truck-hits-car.webp)
కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. శుక్రవారం రాత్రి ట్రక్కు - కారు ఢీ కొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా.. మొత్తం నలుగురు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రక్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగే ప్రమాదానికి కారణమయ్యాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలోనే మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రగాయాలపాలవ్వగా.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Also Read : చైనాలో భారీ భూకంపం.. వణికిపోయిన ప్రజలు
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ వెస్ట్ కుల్దీప్ జైన్ తెలిపిన వివరాల మేరకు.. ట్రక్కు ఢీ కొట్టడంతో.. కారు పూర్తిగా ధ్వంసమయింది. ఈ ప్రమాదానికి కారణమైన లారీ ముందున్న మరో లారీని ఢీ కొట్టింది. పూర్వాంకర అపార్ట్ మెంట్ సమీపంలోని నైస్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్ కు తరలించారు. కాగా.. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story