Thu Mar 19 2026 09:26:11 GMT+0530 (India Standard Time)
15 ఏళ్ల బాలికతో అబార్షన్ మాత్రలు తినిపించారు
పాఠశాలకు తీసుకెళ్తాననే నెపంతో బాలికను ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లి

తమిళనాడులో ఓ 15 ఏళ్ల బాలిక అబార్షన్ మాత్రలు వేసుకుని ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లా చెంగం సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ మురుగన్ (27) అనే వ్యక్తి కారణంగా బాలిక గర్భం దాల్చింది. సదరు వ్యక్తి ఆ అమ్మాయిని రోజూ స్కూల్కి దింపేవాడు. ఆ సమయంలో వారిద్దరికీ అనుబంధం ఏర్పడింది. బాలిక ఇటీవలే గర్భం దాల్చగా, మురుగన్ తన స్నేహితుడు ప్రభు (27) సహాయంతో అబార్షన్ మాత్రలు సంపాదించాడు.
పాఠశాలకు తీసుకెళ్తాననే నెపంతో బాలికను ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లి మార్గమధ్యంలో అబార్షన్ మాత్రను తినిపించాడు. ఆ తర్వాత ఇద్దరు బాలికల పాఠశాల వైపు వెళ్లడం ప్రారంభించగా.. బాలిక అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయింది. దీంతో మురుగన్ బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని వైద్యులు బాలిక చనిపోయిందని ప్రకటించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువనామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మురుగన్, అతని స్నేహితుడు ప్రభుని అదుపులోకి తీసుకున్నారు. మురుగన్పై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.
News Summary - Pregnant minor dies after taking abortion pill
Next Story

