Sat Jul 27 2024 01:53:06 GMT+0000 (Coordinated Universal Time)
3 నెలల తర్వాత..వెలుగు చూసిన పరువు హత్య
ఇంటర్ విద్యార్థిని మోహన్ కృష్ణ మృతి కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. అది పరువు హత్యగా అనుమానిస్తున్నారు
![rowdy sheeter ramesh, guntur murder case rowdy sheeter ramesh, guntur murder case](https://www.telugupost.com/h-upload/2022/10/19/1426958-current-shock.webp)
ఇంటర్ విద్యార్థిని మోహన్ కృష్ణ మృతి కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. అది పరువు హత్యగా అనుమానిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి రెడ్డిగారి పల్లెలో ఈ ఘటన జరిగింది. మోహన్ కృష్ణ జులై 7న ఉరి వేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అది హత్యగా తేలింది. ఈ ఘటన గ్రామంలో సంచలనం కలిగించింది.
ఇతర కులానికి చెందిన...
ప్రేమ విఫలమై ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం హత్యగా తేలడంతో కుటుంబ సభ్యులే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర కులం వాడిని ప్రేమించినందుకు ఈ పరువు హత్య చేసి ఉంటారని, ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.
Next Story