Sat Mar 07 2026 17:10:24 GMT+0530 (India Standard Time)
భార్యను చంపిన నిందితుడికి ఉరిశిక్ష
నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. భార్యను చంపిన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది

నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. భార్యను చంపిన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. అదనపు కట్నం కోసం భార్యను చంపిన వ్యక్తికి క్రిమినల్ కోర్టు ఈ శిక్ష ప్రకటించింది. 2018లో భవానీ నగర్ కు చెందిన ఇంజామ్ హక్ అనే వ్యక్తి అదనపు కట్నం కోసం తన భార్యను హత్య చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్యను హతమార్చి...
భార్యను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా హత్య చేసిన ఇంజామ్ హక్ ను నాలుగేళ్ల క్రితం అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిపై విచారించిన న్యాయస్థానం నిందితుడు ఇంజామ్ హక్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
Next Story

