Sun Mar 15 2026 12:30:03 GMT+0530 (India Standard Time)
కోడలిని అతి దారుణంగా తలనరికి చంపిన అత్త
అన్నమయ్య జిల్లాలో కోడలిని అతి దారుణంగా నరికి చంపింది ఓ అత్త.

అన్నమయ్య జిల్లాలో కోడలిని అతి దారుణంగా నరికి చంపింది ఓ అత్త. కోడలి తలనరికి చంపిన అత్త ఆ తర్వాత కోడలి తలను చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. తన కోడలిని తానే హత్య చేశానని ఒప్పుకుంది. ఈ ఘటనతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా వణికిపోయారు. కోడలి తలతో అత్త అలా నడుచుకుంటూ వెళుతుంటే స్థానికులంతా షాకయ్యారు.
రాయచోటి మండలం కె.రామాపురంలో సుబ్బమ్మ నివసిస్తోంది. కోడలు వసుంధర (35)తో ఆమెకు విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆవేశంతో సుబ్బమ్మ కోడలు వసుంధరపై దాడికి దిగింది. కత్తి తీసుకుని వసుంధర తల నరికేసింది. మొండెం నుండి వేరు పడిన వసుంధర తలను చేత బట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లింది. తన కోడలిని తానే హత్య చేశానని పోలీసులకు చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరిన్ని వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు.
Next Story

