Fri May 17 2024 02:20:51 GMT+0000 (Coordinated Universal Time)
శైలజ కిరణ్ విచారణ ప్రారంభం
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ను ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ను ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు.కేంద్ర చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా లావాదేవీలు జరిగాయని ఇప్పటకే మార్గదర్శిపై ఏపీ సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావును ఏపీ సీఐడీ అధికారులు విచారించారు.
మార్గదర్శి కేసులో...
ఇప్పటికే కొందరు మార్గదర్శి మేనేజర్లను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నేడు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ను విచారిస్తున్నారు. రామోజీరావు నిధుల మళ్లింపు వాస్తవమేనని అంగీకరించడంతో ఏ2 గా ఉన్న శైలజా కిరణ్ను ఈరోజు విచారణ చేస్తున్నారు. శైలజా కిరణ్ ఇంటివద్దనే విచారణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా శైలజ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story