Sat May 24 2025 13:33:34 GMT+0000 (Coordinated Universal Time)
కాచిగూడలో భారీ దోపిడీ.. మత్తు మందిచ్చి.. పనివాళ్లే నిందితులు
హైదరాబాద్ కాచిగూడలో భారీ దొంగతనం జరిగింది. వ్యాపారవేత్త ఇంట్లో నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు

హైదరాబాద్ కాచిగూడలో భారీ దొంగతనం జరిగింది. వ్యాపారవేత్త ఇంట్లో నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇంటి పనివాళ్లే ఈ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. రాత్రి భోజనంలో మత్తు మందు కలిపి మత్తులోకి వెళ్లిన తర్వాత ఇంట్లో దోపిడీ చేసి పరారయినట్లు పోలీసులు కనుగొన్నారు. కాచిగూడలో నివాసముంటన్న వ్యాపారవేత్త హేమరాజు ఇంట్లో కేజీ బంగారం, 70లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఉండే పని మనుషులు హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దంపతులిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సృహ కోల్పోయిన వెంటనే ఇంట్లో ఉన్నబంగారు ఆభరణాలు,నగదును ఎత్తుకెళ్లారు.
నగలు.. నగదు...
ఉదయం వాకింగ్ కి రాకపోవడంతో హేమరాజు న స్నేహితుడు ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హేమరాజు దంపతులు ఇద్దరిని వెంటనే చికిత్స కోసం హైదర్ గూడ లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. స్నేహితుడి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నుంచి బంగారు ఆభరణాలు నగదు ఎత్తుకెళ్లిన నేపాలి దంపతుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story