Sat Jul 27 2024 01:47:30 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ నేత దారుణ హత్య
కృష్ణాజిల్లాలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని జగ్గయ్యపేట వత్సవాయి మండలం లింగాలలో ఈ ఘటన జరిగింది. కృష్ణాజిల్లా
![బీజేపీ నేత దారుణ హత్య బీజేపీ నేత దారుణ హత్య](https://www.telugupost.com/h-upload/2022/02/19/1326697-bjp-leader-murder.webp)
కృష్ణాజిల్లాలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని జగ్గయ్యపేట వత్సవాయి మండలం లింగాలలో ఈ ఘటన జరిగింది. కృష్ణాజిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డిని దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మల్లారెడ్డికి ఎవరితోనైనా శతృత్వం ఉందా ? దేనికోసం అతడిని చంపారు ? హత్య చేసింది బయటివాళ్లా ? లేక సొంతమనుషులేనా ? అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీ కొని నలుగురి మృతి
Next Story