Sat Jul 27 2024 01:40:58 GMT+0000 (Coordinated Universal Time)
నెత్తురోడిన రైలు పట్టాలు.. ఐదుగురు మృతి
పట్టాలు దాటుతున్న వారిని కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొట్టడంతో.. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో..
![నెత్తురోడిన రైలు పట్టాలు.. ఐదుగురు మృతి నెత్తురోడిన రైలు పట్టాలు.. ఐదుగురు మృతి](https://www.telugupost.com/h-upload/2022/04/12/1348480-srikakulam-crime.webp)
శ్రీకాకుళం : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని జి. సిగడాం వద్ద బాతువ గ్రామ సమీపంలో గతరాత్రి ఈ ప్రమాదం సంభవించింది. కోయంబత్తూరు - సిల్చార్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. జనరల్ బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు అత్యవసర చెయిన్ లాగారు. రైలు ఆగడంతో ప్రయాణికులు కిందికి దిగారు. కొందరు ప్రయాణికులు అవతలివైపు ఉన్న పట్టాలు దాటుతుండగా.. అదే సమయంలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు దూసుకొచ్చింది.
పట్టాలు దాటుతున్న వారిని కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొట్టడంతో.. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా అసోంకు చెందినవారుగా గుర్తించారు. కాగా.. ఈ ప్రమాదంపై అధికారుల కథనం మరోలా ఉంది. బోగీలో ఎలాంటి పొగ రాకుండానే ప్రయాణికులు ఉద్దేశపూర్వకంగా చెయిన్ లాగారని ఆరోపిస్తున్నారు. రైల్వే అధికారులకు దొరికిపోతామన్న కంగారులో పట్టాలు దాటుతుండగా వారిని కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టినట్లు చెప్తున్నారు.
Next Story