Fri May 17 2024 04:08:32 GMT+0000 (Coordinated Universal Time)
గుండెపోటుతో జైళ్ల శాఖ డీఎస్పీ కన్నుమూత
జైళ్ళ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) జోగిందర్
పానిపట్: హర్యానా రాష్ట్రం సివా గ్రామంలోని జైళ్ళ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) జోగిందర్ దేస్వాల్ మరణించారు. కర్నాల్లోని తన నివాసంలో ఉన్న ఆయన గుండెపోటుకు గురై మృతి చెందారు. ఉదయం 5 గంటలకు జిమ్లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది.
జోగిందర్ దేస్వాల్ గతంలో కర్నాల్ జైలులో డీఎస్పీగా కూడా పనిచేశారు. కర్నాల్లోని తన నివాసంలో ఉన్న ఆయన గుండెపోటుకు గురై మృతి చెందారు . ఆయన ఉదయం 5 గంటలకు జిమ్లో వ్యాయమం చేస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో స్పాట్ లోనే చనిపోయారు. ఆయనను గమనించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఆయన మృతి చెందారనే వార్త ఆయన బంధువుల్లో, పోలీసు శాఖలోనూ విషాదాన్ని నింపింది. ప్రజలు కూడా నివాళులర్పించడానికి ఆయన నివాసానికి చేరుకున్నారు.
Next Story