Sat Jul 27 2024 01:53:22 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యో టీ.. తాగితే మరణిస్తారా?
ఒక ఇంట్లో టీ తాగి ఐదుగురు మరణించిన సంఘటన ఉత్తర్ప్రదేశ్ లోని మెయిన్పురిలోని నాగ్లా కన్హై లో జరిగింది.
![అయ్యో టీ.. తాగితే మరణిస్తారా? అయ్యో టీ.. తాగితే మరణిస్తారా?](https://www.telugupost.com/h-upload/2022/10/28/1430206-tea.webp)
ఉత్తర్ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. ఒక ఇంట్లో టీ తాగి ఐదుగురు మరణించిన సంఘటన ఉత్తర్ప్రదేశ్ లోని మెయిన్పురిలోని నాగ్లా కన్హై లో జరిగింది. ఈ గ్రామంలో శివానందన్ భార్య ఎప్పటిలాగానే టీ తయారు చేసి ఇంట్లో వారికి ఇచ్చింది. అది తాగిన శివానందన్, అతడి కుమారులు శవంగ్, దివ్యాన్ష్, మామ రవీంద్ర సింగ్, పక్కింటి వ్యక్తి సోబ్రాన్ లు అస్వస్థతకు గురయ్యారు.
ఆసుపత్రికి తరలించినా...
వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో వారిని సైఫాయిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శివానంద్ భార్య టీ కాస్తున్న సమయంలో పంటపొలాలకు పిచికారీ చేసే క్రిమిసంహారక మందును టీ పొడిగా భావించి పాలలో కలిపి తయారు చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. పాలలో విషం కలవడంతోనే ఈ మరణాలు సంభవించాయని వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story