Fri Dec 05 2025 11:08:41 GMT+0000 (Coordinated Universal Time)
ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది

ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో ఒక మట్టి ఇంట్లో గురుశేఖర్ రెడ్డి కుటుంబం ఉంటుంది. గురు శేఖర్ రెడ్డితో పాటు ఆయన భార్య దస్తగిరమ్మ, వారి ఇద్దరు కుమార్తెలు నివాసముంటున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాత్రి ఇల్లు కూలిపోయింది.
మట్టి ఇల్లు కావడంతో...
దీంతో ఇంట్లో నిద్రిస్తున్న గురు శేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ దంపతులతో పాటు ఇద్దరు కుమార్తెలు మరణించారు. వారి మృతదేహాలను బయటకు వెలికి తీశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

