Fri Jan 30 2026 01:08:17 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేను చితకబాదిన ప్రజలు
ఒడిశాలో. బీజేడీ నుంచి సస్పెండ్ అయిన ఒక ఎమ్మెల్యే కారు జనం పైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు

ఒడిశాలో ప్రజల పైకి ఎమ్మెల్యే కారును దూసుకెళ్లింది. బీజేడీ నుంచి సస్పెండ్ అయిన ఒక ఎమ్మెల్యే కారు జనం పైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. 22 మందికి గాయాలయ్యాయి. ఖుర్దాలో పంచాయతీ సర్పంచ్ ఎన్నిక జరుగుతుండగా అక్కడ ప్రజలు గుమికూడారు. అక్కడకు వేగంగా వచ్చిన ఎమ్మెల్యే కారు ప్రజలపైకి దూసుకు వెళ్లింది.
కారు దూసుకెళ్లడంతో...
దీంతో ఆగ్రహించిన ప్రజలు ఎమ్మెల్యే ను చితకబాదారు. ఆయన కారును ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయనను బిజూ జనతా దళ్ సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యే మద్యం సేవించి కారు నడిపారని స్థానికులు ఆరోపించారు. ఈ కారు ఘటనలో గాయపడిన వారిని భువనేశ్వర్ ఎయిమ్స్ కు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

