Sat Jul 27 2024 02:21:46 GMT+0000 (Coordinated Universal Time)
లండన్ లో పల్నాడు విద్యార్థి మృతి
పల్నాడు జిల్లా కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ఈ నెల 2వ తేదీన లండన్ లో మరణించినట్లు సమాచారం అందింది.
![లండన్ లో పల్నాడు విద్యార్థి మృతి లండన్ లో పల్నాడు విద్యార్థి మృతి](https://www.telugupost.com/h-upload/2024/06/11/1629748-london.webp)
లండన్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. పల్నాడు జిల్లా కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ఈ నెల 2వ తేదీన లండన్ లో మరణించినట్లు సమాచారం అందింది. లండన్ లోని పాకిస్థాన్ పోర్ట్ బీచ్ లో సాయిరాం మృతి చెందినట్లు తెలిసింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు విలపిస్తున్నారు.
బీచ్ కు వెళ్లి...
పోలీసులు అందించిన సమాచారం మేరకు తమ కుమారుడు బీచ్ లో మరణించినట్లు తెలిసిందని వారు వాపోతున్నారు. గుంటుపల్లి సాయిరాం విజయవాడలో బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ చేసేందుకు లండన్ వెళ్లాడు. 2021లో లండన్ వెళ్లిన సాయిరాం ఈ నెల 2వ తేదీనబీచ్ కు వెళ్లి అక్కడ మరణించినట్లు తెలిసింది. అయితే సాయిరాం మృతదేహాన్ని భారత్ కు రప్పించేలా అధికారులు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Next Story