Fri Dec 05 2025 18:07:12 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎంపీటీసీ శోభాదేవి దంపతులు మృతి
జన్నారం మండలం ఇందన్ పల్లి వద్ద జన్నారం మాజీ ఎంపీటీసీ శోభాదేవి, ఆమె భర్త మురళీధర్ కలిసి..

మంచిర్యాల : మాజీ ఎంపీటీసీ శోభాదేవి దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంచిర్యాలలో జరిగిన రోడ్డుప్రమాదంలో దంపతులిద్దరూ మరణించారు. జన్నారం మండలం ఇందన్ పల్లి వద్ద జన్నారం మాజీ ఎంపీటీసీ శోభాదేవి, ఆమె భర్త మురళీధర్ కలిసి ప్రయాణిస్తోన్న కారు.. ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికవేగమే కారు ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story

