Fri Dec 05 2025 17:46:43 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : పంజాగుట్టలో పట్టుబడ్డ నగదు ఎంతంటే?
తెలంగాణ ఎన్నికల సందర్భంగా భారీగా డబ్బులు పట్టుబడుతున్నాయి. కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు

తెలంగాణ ఎన్నికల సందర్భంగా భారీగా డబ్బులు పట్టుబడుతున్నాయి. కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. ప్రజలకు పంచడానికి తీసుకు వెళుతున్న నగదుతో పాటు హవాలా సొమ్ము కూడా పట్టుబడిన వాటిలో ఉంది. పోలీసులు నిత్యం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతల వాహనాలను కూడా వదలడం లేదు. వారి వాహనాలను చెక్ చేసిన తర్వాతనే బయటకు పంపుతున్నారు. వాహనాల తనిఖీ జరుగుతుందని తెలిసినా డబ్బులు కట్టలు కట్టలు తీసుకెళుతున్నారు.
ఖానాపూర్ కు తరలిస్తుండగా...
తాజాగా పంజాగుట్టలో ఒక వాహనం నుంచి 97 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీ చేస్తుండగా పంజాగుట్ట వద్ద ఒక వాహనంలో డబ్బు తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీలు చేయగా, అందులో 97 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును హైదరాబాద్ నుంచి ఖనాపూర్ కు డబ్బులు తరలిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story

