Tue Jan 20 2026 17:01:05 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కేంద్ర మంత్రి మాంఝీ మనవరాలి కాల్చివేత
బీహార్ గయలో దారుణం చోటు చేసుకుంది. కేంద్రమంత్రి మాంఝీ మనవరాలని ఆమె భర్త కాల్చి చంపారు.

బీహార్ గయలో దారుణం చోటు చేసుకుంది. కేంద్రమంత్రి మాంఝీ మనవరాలని ఆమె భర్త కాల్చి చంపారు. కుటుంబ వివాదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. కుటుంబంలో తలెత్తిన విభేధాల కారణంగా సుష్మను ఆమె భర్త గన్ తో కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. అయితే ఎందుకు ఈ ఘటన జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కుటుంబంలో నెలకొన్న...
గత కొద్ది రోజులుగా దంపతుల మధ్య నెలకొన్న విభేదాలు ఈ ఘటనకు కారణమయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Next Story

