Sat May 18 2024 05:16:59 GMT+0000 (Coordinated Universal Time)
మధ్యప్రదేశ్ లో దారుణం.. దుండగుల కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
కాల్పుల్లో గాయపడిన వారిని మోరెనా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టమ్..
మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మొరెనా జిల్లాలోని లేపాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఆరుగురు మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురు గాయపడ్డారు.
కాగా.. భూ వివాదం, పాత కక్షల నేపథ్యంలోనే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. కాల్పుల్లో గాయపడిన వారిని మోరెనా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం మార్చురీకి పంపారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మొత్తం 8 మంది కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Next Story