Fri Dec 05 2025 13:57:14 GMT+0000 (Coordinated Universal Time)
ఉప సర్పంచ్ దారుణ హత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కుర్న పల్లి ఉప సర్పంచ్ రాముడును మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. చర్ల మండలం కుర్న పల్లి ఉప సర్పంచ్ రాముడును మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్ గా భావించి రాముడును మావోయిస్టులు చంపేశారు. ఈ మేరకు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని వారు లేఖలో హెచ్చరించారు.
ఇన్ఫార్మర్ అని భావించి..
నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఒక వ్యక్తి వచ్చి రాములును బయటకు తీసుకెళ్లారు. నిర్మానుష్యప్రదేశంలోకి తీసుకెళ్లి రాములును హతమార్చారు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడినా వినిపించుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

