Tue Jan 20 2026 22:39:42 GMT+0000 (Coordinated Universal Time)
80 లక్షల చోరీ : పట్టుకున్న పోలీసులు
శంషాబాద్ వద్ద ఘరానా మోసం జరిగింది. ఎనభై లక్షల రూపాయలతో రియల్టర్ ఉడాయించారు

శంషాబాద్ వద్ద ఘరానా మోసం జరిగింది. ఎనభై లక్షల రూపాయలతో రియల్టర్ ఉడాయించారు. అయితే పోలీసులు చివరకు అతనిని పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం 80 లక్షలతో ఎయిర్ పోర్టుకు వచ్చిన ముగ్గురిని మోసం చేసి రవి అనే రియల్టర్ ఉడాయించాడు.
రియల్టర్ మోసం...
దీంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన పోలీసులకు బాధితులు విజయ్, శ్రీధర్, సంతోష్లు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఎయిర్పోర్టు పోలీసులు సీసీ టీవీ పుటేజీనీ పరిశీలించి నిందితుడు రవిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ జరిగిన 80 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సొత్తుతో పాటు రవికి చెందిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా బాధితులు విజయ్, శ్రీధర్, సంతోష్లు షేక్పేట్ కు చెందిన వారు.
Next Story

