Fri Jan 30 2026 12:28:34 GMT+0000 (Coordinated Universal Time)
తాడిపత్రిలో దారుణం
చుక్కలూరు రోడ్లో వున్న శ్రీనిధి నల్ల బండల ఫ్యాక్టరీలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్యా,భర్తలతో పాటు, మరో అమ్మాయి పై

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి దంపతులపై దుండగులు పెట్రోల్పోసి నిప్పంటించారు. తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నెలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలు నల్లపురెడ్డి, కృష్ణవేణి ఆరుబయట నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు సమీపంలో నిద్రిస్తున్న అమ్మాయికి మంటలు అంటుకున్నాయి. ముగ్గురికీ తీవ్ర గాయాలు కావడంతో వారిని అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు.
చుక్కలూరు రోడ్లో వున్న శ్రీనిధి నల్ల బండల ఫ్యాక్టరీలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్యా,భర్తలతో పాటు, మరో అమ్మాయి పై పెట్రోల్ పోసి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. నల్లపరెడ్డి ,సరస్వతిలతో పాటు, పూజిత అనే అమ్మాయికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

