Sat Jul 27 2024 02:22:10 GMT+0000 (Coordinated Universal Time)
మహారాష్ట్రలో దారుణం... బాలికపై అత్యాచారం
మహారాష్ట్రలో దారుణం జరిగింది. బాలికపై ఎనిమిది మంది నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు
![girl, atrocity, maharashtra girl, atrocity, maharashtra](https://www.telugupost.com/h-upload/2022/09/24/1418477-girl-atrocity-maharashtra.webp)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. బాలికపై ఎనిమిది మంది నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులందరినీ అరెస్ట్ చేసి ప్రశనిస్తున్నారు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన బాలికను మాయమాటలు చెప్పి సముద్రతీర ప్రాంతంలోకి ఒక బాలుడు తీసుకెళ్లాడు. తర్వాత అక్కడ మరో ఏడుగురు నిందితులు వచ్చి అందరూ కలసి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
రాత్రంతా వేధింపులు...
రాత్రంతా వేధింపులు ఎదుర్కొన్న బాలిక ఉదయం ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆలస్యంగా జరిగిన ఈ ఘటన పై పోలీసులు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- girl
- maharashtra
Next Story