Fri Dec 05 2025 11:02:40 GMT+0000 (Coordinated Universal Time)
Tirupathi : తిరుపతిలో విషాదం.. ముగ్గురు మృతి
తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. భవనంపై నుంచి పడి ముగ్గురు కార్మికులు పడి మరణించారు

తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. భవనంపై నుంచి పడి ముగ్గురు కార్మికులు పడి మరణించారు. మంగళం పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్కారం తుడా క్వార్టర్స్ సమీపంలోని హెచ్ఐజీ విభాగంలో ప్లాట్ నెంబరు 63 లోఐదంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవనం శ్రీకాళహస్తికి చెందిన ఆండాలయ్య నిర్మిస్తున్నారు.
భవన నిర్మాణం కోసం...
ఈ భవన నిర్మాణం కోసం పెళ్లకూరు మండలం అక్కగారిపేటకు చెందిన బొటోతొట్టి శ్రీనివాసులు, ఒంగోలుకు చెందిన వసంత్, కె. శ్రీనివాసులు, కావలికి చెందిన మాధవ్ పనిచేస్తున్నారు. ఐదో అంతస్థులో పని చేస్తుండగా కర్రలు విరిగిపోయాయి. దీంతో ఈ ప్రమాదం నుంచి మాధవ్ తప్పించుకుని బయటపడగా, మిగిలిన ముగ్గురు పై నుంచి కిందపడి ప్రాణాలు విడిచారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వారి స్వగ్రామాలకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story

