Wed Jan 21 2026 08:22:50 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన తల్లి మృతి
హైదరాబాద్ లోని మియాపూర్ లో ప్రేమోన్మాది జరిపిన దాడిలో తల్లి మరణించింది

హైదరాబాద్ లోని మియాపూర్ లో ప్రేమోన్మాది జరిపిన దాడిలో తల్లి మరణించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి మరణించింది. నిన్న మియాపూర్ లో విశాఖకు చెందిన సందీప్ అనే యువకుడు తను ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.
చికిత్స పొందుతూ...
ఈ దాడిలో అడ్డువచ్చిన తల్లిని కూడా కత్తితో పొడిచాడు. దీంతో తల్లీ, కూతూళ్లిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ తల్లి శోభ మృతి చెందింది. గాయపడిన వైభవి చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

