Sat Jul 27 2024 05:58:35 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన జరిగింది.
![road accident, four people died, shoe company labour, tamil nadu road accident, four people died, shoe company labour, tamil nadu](https://www.telugupost.com/h-upload/2022/03/26/1341387-road-accident-four-people-died-shoe-company-labour-tamil-nadu.webp)
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన జరిగింది. ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. హైటెక్ సిటీ వద్ద ఈ ఘటన చోట చేసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వనపర్తి జిల్లా వాసులుగా...
హైటెక్ సిటీ వద్ద ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతులంతా వనపర్తి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు రాజప్ప, శ్రీను, కృష్ణగా పోలీసులు మీడియాకు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story