Fri Mar 20 2026 19:51:53 GMT+0530 (India Standard Time)
Road Accident : ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించార. అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన ప్రభుత్వ బస్సు దూసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.
గాయాలపాలయిన వారిని...
ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ స్థంభించకుండా పోలీసులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

