గ్యాస్ వినియోగదారులు బయెమెట్రిక్ అప్డేట్ చేయకుంటే సబ్సిడీ రాదా? నిజమెంత?
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ దాదాపు అందరికి ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించిన ఈ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ దాదాపు అందరికి ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించిన ఈ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే డిసెంబర్ 31వ తేదీ లోపు గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ను అప్డేట్ చేసుకోవాలని, లేకుంటే సబ్సిడీ అందని చెబుతున్నారు. అంతేకాదు.. బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోకుంటే గ్యాస్ సిలిండర్ అందుబాటులో ఉండదని కూడా పుకార్లు షికార్లు అవుతున్నాయి. దీంతో చాలా మందిని, అలాగే గ్యాస్ డీలర్లను సైతం ఆందోళన కలిగిస్తోంది. నిజంగానే బయోమెట్రిక్ లేకుంటే సబ్సిడీ రాదా..? గ్యాస్ సిలిండర్ ఇవ్వరా..? మార్కెట్లో రకరకాల తప్పుడు వార్తలపై నిజాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని చెప్పింది తప్పా.. చివరి రోజుగా ఏతేదీని నిర్ణయించలేదు. బయోమెట్రిక్ను పూర్తి చేయాలని పంపిణీదారులను కోరింది. ఇప్పటి వరకు ఇలాంటి గడువు ఇవ్వలేదని ఇండియన్ ఆయిల్ కంపెనీ (IOC) చెబుతోంది. అంటే డిసెంబర్ 31 తర్వాత కూడా మీరు వెళ్లి మీ బయోమెట్రిక్లను అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే అనేక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు బయోమెట్రిక్ అప్డేట్ల కోసం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. బయోమెట్రిక్ కోసం డిస్ట్రిబ్యూటర్ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఇండియన్ ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఎలాంటి గడువు విధించలేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
వినియోగదారుల నుంచి పంపిణీ దారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లయితే గ్యాస్ కంపెనీ ఫిర్యాదు చేయవచ్చు.18002333555 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. బయోమెట్రిక్ చేయకుంటే సబ్సిడీ రాదన్న సమాచారం పూర్తిగా అబద్దమని తెలుస్తోంది. కేంద్రం లేదా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు అటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని గుర్తించుకోండి.
వినియోగదారులందరూ LPG సిలిండర్ల కోసం బయోమెట్రిక్లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి సబ్సిడీ కస్టమర్లు మాత్రమే తమ బయోమెట్రిక్లను అప్డేట్ చేసుకోవచ్చు. మీరు గ్యాస్ స్టేషన్ వద్ద పొడవైన లైన్లలో నిలబడలేకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.ఫేస్ రికగ్నిషన్ ద్వారా యాప్ ఆధారిత బయోమెట్రిక్ ప్రక్రియను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు చర్యలు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఇళ్లకు గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చే డెలివరీ బాయ్లకు త్వరగా శిక్షణ ఇవ్వాలని, తద్వారా బయోమెట్రిక్లు ఇంటి వద్దే పనిచేసేలా పంపిణీదారులు యోచిస్తున్నారు. ఆధార్ ధృవీకరణ కోసం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఆయిల్ కూడా ఆధార్ సంబంధిత సమస్యల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

