Fri Dec 05 2025 14:02:43 GMT+0000 (Coordinated Universal Time)
గౌతమ్ అదానీపై న్యూయార్క్ లో కేసు నమోదు
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై న్యూయార్క్ లో కేసు నమోదయింది.

ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై న్యూయార్క్ లో కేసు నమోదయింది. బిలియన్ డాలర్ల మోసానికి పాల్పడినట్లు అదానీపై కేసు నమోదయింది. గౌతమ్ అదానీతో పాటు ఆయన బంధువు సాగర్ తో సహా మరో ఏడుగురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లంచం ఇవ్వచూపి...
గత ఇరవై ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత్ అధికారులకు 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ కేసు నమోదయింది. అదానీ కంపెనీ రుణదాతలు, పెట్టుబడి దారుల నుంచి మూడు బిలియన్ డాలర్లకు పైగా రుణాలను, బాండ్లను సేకరించిందన్న అభియోగాలను అదానీ ఎదుర్కొంటున్నారు.
Next Story

