Thu Jan 29 2026 07:20:19 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya trains : అయోధ్యకు వెళ్లాలరనుకుంటున్నారా? అయితే సులువుగా.. తక్కువ ధరలో ఇలా వెళ్లండి
అయోధ్యలో శ్రీరాముడిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు బయలుదేరుతున్నారు

అయోధ్యలో శ్రీరాముడిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు బయలుదేరుతున్నారు. వీరు అయోధ్యకు సురక్షితంగా చేరుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయోధ్యకు ప్రతి సోమవారం వరంగల్ నుంచి ఈ రైలు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
స్పెషల్ ట్రైన్ లు...
శ్రద్ధా సేత్ రైలుగా దీనికి నామకరణం చేశారు. వరంగల్ నుంచి సోమవారం, కాజీపేట నుంచి ప్రతి శుక్రవారం బయలుదేరే ఈ ప్రత్యేక రైలులో ప్రయాణం కూడా సుఖవంతంగా ఉంటుందని పేర్కొంది. కాజీపేట నుంచి యశ్వంత్ పూర్ - గొరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు కూడా అయోధ్యకు వెళుతుందని తెలిపారు. ఈ రైళ్లలో జనరల్ టిక్కెట్ ధర నాలుగు వందల రూపాయలు కాగా, స్లీపర్ కోచ్ లో ప్రయాణ ధర 658 రూపాయలుగా నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది.
Next Story

