Fri May 17 2024 04:44:56 GMT+0000 (Coordinated Universal Time)
జగన్.. ఆ నిర్ణయం వెనక్కు తీసుకోండి
గ్రామ సచివాలయాలకు 20 లక్షల రూపాయలు కేటాయించడంపై వైవీబీ రాజేంద్రప్రసాద్ అభ్యంతరం తెలిపారు.
గ్రామ సచివాలయాలకు 20 లక్షల రూపాయలు కేటాయించడంపై పంచాయతీ రాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యేలు, వాలంటీర్లు నిధులు ఖర్చు పెట్టడం దారుణంగా ఉందని ఆయన అన్నారు. వారికి కాకుండా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు కేటాయించి సర్పంచ్ లు, కౌన్సిలర్లు నిధులు వినియోగించేలా చూడాలని రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఇది 73,74 వ రాజ్యాంగ సవరణ చట్టాలకు వ్యతిరేకమని ఆయన అన్నారు. పంచాయతీల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్నారు.
దారి మళ్లించిన నిధులు....
జగన్ నిర్ణయంతో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను నిర్వీర్యం చేేసే విధంగా ఉందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలను పట్టించుకోవడం లేదన్నారు. సర్పంచ్, కౌన్సిలర్లను ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మార్చే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వాటికి పోటీగా సమాంతరంగా వాలంటీర్ల వ్యవస్థను తయారు చేశారని ఆయన ఆరోపించారు. 14, 15 ఆర్థిక సంఘం నిధుల ద్వారా కేంద్ర ప్రభుత్వం పంపిన 7,660 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
Next Story