Tue Jan 20 2026 10:21:48 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీకి ఈసారి 60 సీట్లే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి కేవం 60 స్థానాలు మాత్రమే వస్తాయని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు

ిఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ వైసీపీకి కేవం 60 స్థానాలు మాత్రమే వస్తాయని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. వైసీపీ ఇటీవల చేయించుకున్న సర్వేలో ఇది వెల్లడయిందని ఆయన తెలిపారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 115 స్థానాలు వస్తాయని సర్వేలో తేలిందని రఘురామ కృష్ణరాజు తెలిపారు. అందుకోసమే త్వరలోనే ఏపీలో శాసనసభకు ఎన్నికలకు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు.
ముందస్తు ఎన్నికలు...
డిసెంబరులో శాసనసభను రద్దు చేసి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలకు వెళ్లాలని తమ పార్టీ అధినేత జగన్ చూస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వంద మంది అభ్యర్థులను మారుస్తానని తమ పార్టీ అధినేత చెబుతున్నారన్నారు. కానీ వైసీపీ టిక్కెట్ ను ఈసారి ఎవరూ అడిగే పరిస్థితి కన్పించడం లేదని చెప్పారు. ఎన్నిక ఖర్చు మొత్తం భరిస్తానంటే అభ్యర్థులు ముందుకు వస్తారని రఘురామ కృష్ణరాజు వెల్లడించారు.
Next Story

